‘కాశీనాథుని విశ్వనాథ్’ పురస్కారాలు
- June 12, 2017
కళా తపస్వి కె. విశ్వనాథ్ తీసిన ‘శంకరాభరణం’లో చిన్న పిల్లాడి పాత్రలో నటించారు బాల నటి తులసి. ఆ తర్వాత బాల నటిగా పలు చిత్రాల్లోనూ, ఆ తర్వాత కథానాయికగా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు సంపాదించుకున్నారామె. శంకరం పాత్రతో తనను తెరకు పరిచయం చేసిన గురువు విశ్వనాథ్ పట్ల ఆమెకు అపారమైన గౌరవాభిమానాలున్నాయి.
అందుకే విశ్వనాథ్ పేరుతో ఆమె పురస్కారాల్ని ఇవ్వబోతున్నారు. తులసి మాట్లాడుతూ– ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలోని ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రతి ఏటా గురువు విశ్వనాథ్గారి పేరిట ‘కాశీనాథుని విశ్వనాథ్’ పురస్కారాలు ఇవ్వనున్నా. ఈ ఏడాది పురస్కారాల ప్రదానోత్సవం ఈ నెల 20న హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరగనుంది. ఈ వేడుకకి గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్, దక్షిణ, ఉత్తరాది సినీ ప్రముఖులు హాజరవుతారు’’ అన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం









