భారత డిప్యూటీ హైకమిషనర్కు సమన్లు జారీచేసిన పాక్
- June 12, 2017
కశ్మీర్లో నిత్యం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ, చొరబాట్లకు పాల్పడుతున్న పాక్...అలాంటిదేమీ లేదని ఎప్పటికప్పుడు బుకాయిస్తూనే ఉంది. తాజాగా నియంత్రణ రేఖ వెంబడి భారత దళాలు జరుపుతున్న కాల్పుల్లో తమ దేశ పౌరులు ముగ్గురు మృతి చెందారని ఆరోపిస్తూ.. పాక్లోని భారత డిప్యూటీ హై కమిషనర్ను పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. డైరెక్టర్ జనరల్ (దక్షిణాసియా, సార్క్) మొహమ్మద్ ఫైసల్ భారత డిప్యూటీ హైకమిషనర్ జె.పి.సింగ్ను పిలిపించి భారత దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కాల్పులు జరపడాన్ని ఖండించినట్టు పాక్ విదేశాంగ కార్యాలయం తెలిపింది. ఈనెల 10, 12 తేదీల్లో చిరికోట్, హాట్ స్ప్రింగ్ సెక్టార్లలో జరిపిన కాల్పుల్లో ముగ్గురు పాక్ పౌరులు మరణించారు. 'పౌరులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయడాన్ని ఖండిస్తున్నాం. ఇది అంతర్జాతీయ మానవ హక్కులు, మానవ చట్టాలను ఉల్లంఘించడమే' అని విదేశాంగ కార్యాలయం పేర్కొంది. 2003 కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ గౌరవించాలని, కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించిన అన్ని ఘటనలపై దర్యాప్తు జరిపించాలని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని యథాతథంగా గౌరవించి, నియంత్రణ రేఖ వెంబడి శాంతి నెలకొనేలా భారత దళాలను ఆదేశించాలని డైరెక్టర్ జనరల్ ఫైసల్ కోరారు.
జన్డ్రాట్, హాట్స్ర్పింగ్ సెక్టార్లలో కాల్పుల విరమణ ఒప్పందానికి భారత దళాలు తూట్లు పొడిచి ఎలాంటి హెచ్చరికలు లేకుండానే భారీ ఆయుధాలు, మోర్టార్లతో విరుచుకుపడినట్టు పాక్ ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ కాల్పుల్లో ముగ్గురు పాక్ పౌరులు మరణించారని తెలిపింది.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









