పారిశుధ్య కార్మికులకు ఎండ నుంచి రక్షణ కప్పులు పురపాలకశాఖ అందచేత

- June 12, 2017 , by Maagulf
పారిశుధ్య కార్మికులకు  ఎండ నుంచి రక్షణ కప్పులు పురపాలకశాఖ అందచేత

జెడ్డా : పురపాలక సంఘాల పరిధిలో వివిధ ప్రదేశాలలో మిట్ట మధ్యాహ్నం  సూర్యుడు కింద పనిచేసే కార్మికులకు మూడు నెలల నిషేధం గురువారం (15 వ తేదీ) మధ్యాహ్నం  నుంచి సాయంత్రం 3 గంటల వరకు పని నిషేధం అమలులో రానున్న విషయం పాఠకులకు విదితమే లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్  మంత్రిత్వ శాఖ పారిశుధ్య  కార్మికులు రోజుల వరకు ఎండ బారిన పడకుండా నీడ పట్టున పనిచేసే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లకు ఆదేశించింది. రియాద్ పురపాలక సంఘం పరిధిలో శుభ్రపరిచే కార్మికులకు 6,000 ఎండ తగలని రక్షణ కప్పులను  అందజేయాలని కోరింది. తబూక్ మునిసిపాలిటీ ప్రధాన వీధులకు కేటాయించిన కార్మికులకు సన్ షేడ్స్ తో ఉన్న 400 బండ్లను అందించింది మరియు నగరవ్యాప్తంగా ఉన్న కార్మికులకు 1,000 తలకు నీడను ఇచ్చే  షేడ్స్ అందించబడ్డాయి. కస్సిమ్లోని మునిసిపాలిటీలు కార్మికులను సన్ షేడ్స్ ను  జూన్  15 వ తేదీ నుంచి సెప్టెంబరు 15 వ తేదీ వరకు అమలులో నిషేధం అమలవుతుందని తెలిపారు. ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగుల భద్రతకు హామీ ఇవ్వాలని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పని సంబంధిత ఘటనలను తగ్గించేందుకు కార్మికులకు రక్షణను మెరుగుపరిచేందుకు తాము శ్రద్ధగా పని చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఖాలిద్ అబాఅల్ అన్నారు  నిషేధిత సమయంలో వాతావరణ పరిస్థితులను పరిశీలించేందుకు గవర్నర్లతో సమన్వయంతో మంత్రిత్వశాఖ పని చేస్తుందని ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com