రాష్ట్రపతి పదవి రేసులో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు

- June 12, 2017 , by Maagulf
రాష్ట్రపతి పదవి రేసులో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు

మోడీ ప్రభుత్వంలో సమాచార శాఖా మంత్రిగా కొనసాగుతున్న ఎం. వెంకయ్య నాయుడు రాష్ట్రపతి పదవికి  బీజేపీ తరపున పోటీ పడుతున్న వ్యక్తినంటూ తానే స్వయంగా చెప్పుకుంటున్నారు. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు, ప్రధాన సలహాదారుడు అయిన వెంకయ్య చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి అభ్యర్ధిగా తన పేరు కూడా పరిశీలనలో ఉందని చెప్పడంతో వచ్చినవారంతా ఆశ్చర్యపోయారు.  అయితే ఈ వార్త దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.  ఇప్పటివరకు బీజేపీ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా జార్ఖండ్‌కు చెందిన గిరిజన మహిళా నేత ద్రౌపది ముర్ము పేరుకూడా ప్రధానంగా వినిపిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com