ఖతిఫ్ లో అత్యవసర దళ అధికారిని బలిగొన్న పేలుడు పరికరం
- June 12, 2017
ప్రజల రక్షణార్ధమై రేయంబగళ్లు కాపలా కాచే పోలీస్ అధికారులు తీవ్రవాదుల రక్త దాహానికి బలి కాబడుతున్నారు. ఈ సంఘటన అదే కోవలోనికి చెందుతుంది. స్థానిక అల్-మాసౌరా జిల్లాలోని ఖతిఫ్ ప్రాంతంలో ఆదివారం బాగా పొద్దుపోయాక గుర్తించబడని అనుమానితులు పేల్చిన ఒక పేలుడు పరికరం ఒక అత్యవసర దళాల అధికారిని దారుణంగా హతమార్చి మరో ఇద్దరు అధికారులను తీవ్రంగా గాయపరిచింది. మరణించిన ఆ అధికారి పేరు మేజర్ తారిక్ బిన్ అబ్దుల్లాతఫ్ అల్-అల్లాఖీగా పేర్కొంటున్నారు. ఖతిఫ్ సమీపంలో గస్తీ నిర్వహిస్తున్న ఈ ముగ్గురు అధికారులు ప్రయాణిస్తున్న వాహనంను ఒక పేలుడు పదార్ధాలతో కూడిన పరికరం ఏదో బలంగా ' ఢీ ' కొట్టింది. దీనితో అక్కడ ఒక భారీ విస్ఫోటనం జరిగినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధికి తెలిపారు. కాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అధికారులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







