అమాయకంగా నటించి దొంగతనానికి పాల్పడ్డ వైనం
- June 13, 2017
అజ్మన్ పోలీసులు ఆసియాకి చెందిన ఓ వ్యక్తి నుంచి 24,000 దిర్హామ్లు దొంగతనం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ దొంగతనంలో సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అజ్మన్ పోలీస్, పోలీస్ ఆపరేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ అబ్దుల్లా సైఫ్ అల్ మత్రోషి మాట్లాడుతూ, దొంగతనానికి సంబంధించి ఫిర్యాదు అందగానే స్పందించినట్లు చెప్పారు. బాధితుడు బ్యాంకు నుంచి డబ్బుని డ్రా చేసి బయటకు వస్తుండగా, ఓ వ్యక్తి యూఏఈ కరెన్సీ ఎలా ఉంటుందో చూపించమని అడగ్గా, బాధితుడు తాను డ్రా చేసిన 70,000 మొత్తాన్ని చూపించాడనీ, కాస్సేపటి తర్వాత డబ్బులు లెక్కిస్తే అందులోంచి 24,000 దిర్హామ్లు తగ్గినట్టుగా గుర్తించి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడని అధికారులు తెలిపారు. ఇరవై నాలుగ్గంటల్లోనే నిందుతులిద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనీ, అపరిచిత వ్యక్తులు దృష్టి మరల్చి డబ్బు కాజేస్తారు గనుక, ఎవర్నీ విశ్వసించరాదని పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









