బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం: కొండచరియలు విరిగిపడి 26మంది మృతి

- June 13, 2017 , by Maagulf
బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం: కొండచరియలు విరిగిపడి 26మంది మృతి

బంగ్లాదేశ్‌లో పెను ప్రమాదం సంభవించింది. భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 26 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా బంగ్లాదేశ్‌లోని ఢాకా, చిట్టగాంగ్‌ నగరాల్లో సోమవారం నుంచీ ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు సంభవించి.. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
ఈ ఘటనల్లో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. రంగమతిలో 10 మంది, బందర్బాన్‌లో ఏడుగురు, చిట్టగ్యాంగ్‌లో 8 మంది కొండచరియల కింద సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. భారీ వర్షాలతో అప్రమత్తమైన సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com