ట్యాంక్ బండ్ పై డాక్టర్ సి. నారాయణ రెడ్డి విగ్రహం

- June 13, 2017 , by Maagulf
ట్యాంక్ బండ్ పై డాక్టర్ సి. నారాయణ రెడ్డి విగ్రహం

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి భౌతికకాయానికి పలువురు రాజకీయ, సినీ, భాషాభిమానులు నివాళులు అర్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సినారె మృతదేహం పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవల్ని స్మరించుకున్నారు. సినారెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఈ నేపధ్యంలో హైదరాబాద్‌లో స్థలం కేటాయించి సినారె పేరిట స్మారక భవనం, సమావేశ మందిరం ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. తెలంగాణలోని ఓ యూనీవర్సటీకి సినారె పేరు పెట్టనున్నట్లు వెల్లడించారు. ట్యాంక్‌బండ్‌తో పాటు సిరిసిల్ల జిల్లా కేంద్రం, ఆయన స్వగ్రామంలో కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తాం.’ అని పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com