విశ్రాoతి గదిలో చనిపోయిన ప్రవాస భారతీయుడు
- June 13, 2017
బహ్రెయిన్:బతుకు తెరువు కోసం కుటుంబ సభ్యులను వదిలి ఎడారి దేశాలలో రేయంబగళ్లు పనిచేసే పలువురు కార్మికుల జీవితాలు అర్దాయుస్సుతో విషాదంగా ముగిసిపోతున్నాయి. ఆ జాబితాలో మంగళవారం మరో ప్రవాస భారతీయుడు చేరాడు. ఎవరికీ తెలియకుండా ఒక విశ్రాoతి గదిలో ఆయన చనిపోయినట్లు తోటి కార్మికులు కనుగొన్నారు.ఒక కాంట్రాక్టు సంస్థలో పనిచేసి సేవ్య రాథవన్ మృతి చెందినట్లుగా ఉదయం 10.45 గంటలకు వైద్యులు ప్రకటించారు "తనకు ఆరోగ్యం బాగోలేదని తనపై అధికారి సూపర్వైజర్ కు ఫిర్యాదు చేశాడు ఒకపూట శెలవు తీసుకోమని ఆ పర్యవేక్షకుడు ఆయనకు అనుమతి ఇచ్చారు. దీంతో నేరుగా విశ్రాoతి గదికి వెళ్ళి సేవ్య రాథవన్ పడుకొన్నారు. అయితే ఎంతసేపటికి ఆయన నిద్ర లేకపోవడంతో సహోద్యోగులు విశ్రాoతి గది తలుపులు పగలకొట్టి లోనికి ప్రవేశించారు, సేవ్య రాథవన్ నేల మీద అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గమనించి ఆయనను కార్మిక శిభిరంలోని ఆసుపత్రికి తక్షణమే తరలించారు. కానీ, అక్కడ వైద్యులు సేవ్య రాథవన్ అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ప్రవాస భారతీయుడు మరణించినట్లు వైద్యులు తర్వాత నిర్ధారించారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









