విశ్రాoతి గదిలో చనిపోయిన ప్రవాస భారతీయుడు

- June 13, 2017 , by Maagulf
విశ్రాoతి గదిలో చనిపోయిన ప్రవాస భారతీయుడు

బహ్రెయిన్:బతుకు తెరువు కోసం కుటుంబ సభ్యులను వదిలి ఎడారి దేశాలలో రేయంబగళ్లు పనిచేసే పలువురు కార్మికుల జీవితాలు అర్దాయుస్సుతో విషాదంగా ముగిసిపోతున్నాయి. ఆ జాబితాలో మంగళవారం మరో  ప్రవాస భారతీయుడు చేరాడు. ఎవరికీ తెలియకుండా ఒక విశ్రాoతి గదిలో ఆయన  చనిపోయినట్లు తోటి కార్మికులు కనుగొన్నారు.ఒక కాంట్రాక్టు సంస్థలో  పనిచేసి సేవ్య రాథవన్ మృతి చెందినట్లుగా ఉదయం 10.45 గంటలకు వైద్యులు ప్రకటించారు "తనకు ఆరోగ్యం బాగోలేదని తనపై అధికారి  సూపర్వైజర్ కు ఫిర్యాదు చేశాడు ఒకపూట శెలవు తీసుకోమని ఆ పర్యవేక్షకుడు ఆయనకు అనుమతి ఇచ్చారు. దీంతో నేరుగా విశ్రాoతి గదికి వెళ్ళి సేవ్య రాథవన్ పడుకొన్నారు. అయితే ఎంతసేపటికి  ఆయన నిద్ర లేకపోవడంతో సహోద్యోగులు విశ్రాoతి గది  తలుపులు పగలకొట్టి లోనికి ప్రవేశించారు, సేవ్య రాథవన్ నేల మీద అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గమనించి ఆయనను కార్మిక శిభిరంలోని ఆసుపత్రికి తక్షణమే తరలించారు. కానీ, అక్కడ వైద్యులు సేవ్య రాథవన్ అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ప్రవాస భారతీయుడు మరణించినట్లు వైద్యులు తర్వాత నిర్ధారించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com