నకిలీ డిటర్జెంట్ ఫ్యాక్టరీ మూసివేత తర్వాత 10 మందికి జైలు శిక్ష
- June 13, 2017
అనుమతి లేని అక్రమ కర్మాగారాలలో నకిలీ డిటర్జెంట్లను తయారుచేసిన నేరంలో దోషులుగా నిర్ధారించిన తరువాత10 మంది నిందితులకు ఒకొక్కరికి 90 నెలల జైలుశిక్ష విధిస్తూ రియాద్ లోని క్రిమినల్ కోర్టు తీర్పు వెలువరించింది. అంతేకాక ప్రతి నిందితుడు ఆరు నుంచి 18 నెలల మధ్య జైలుశిక్షను మరియు 100,000 సౌదీ రియాళ్లను ( 26,700 డాలర్లను) జరిమానా సౌదీ అరేబియా వాణిజ్య మరియు పెట్టుబడుల మంత్రిత్వ శాఖ విధించింది.ఒక సౌదీ దేశీయుడు, ఇద్దరు సిరియన్లు, ఇద్దరు ఇథియోపియన్లు మరియు ఐదుగురు ఇథియోపియన్ మహిళలతో ఈ ముఠా రూపొందించబడింది.10 ఏళ్ళ జైలుశిక్ష పూర్తి చేసిన అనంతరం 9 మంది విదేశీ నేరస్తులను దేశ బహిష్కరణ చేయనున్నారు. ఈ పది మంది నేరస్థులను నకిలీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి, నకిలీ డిటర్జెంట్లను ఉత్పత్తి చేయడమే కాక నకిలీ ట్రేడ్మార్క్లను ఉపయోగించారు. వినియోగదారులను రక్షించడానికి, వాణిజ్య వ్యతిరేక మోసం చట్టాలు మరియు ట్రేడ్మార్క్ వ్యవస్థ యొక్క దుర్వినియోగం తదితర ఉల్లంఘనను నివారించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను అడ్డుకొంటామని సౌదీ అరేబియావాణిజ్య మరియు పెట్టుబడుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
అలాగే, వినియోగదారుల ఆరోగ్య భద్రతకు హాని కలిగించి వినియోగదారులను మోసగించడానికి ప్రయత్నించే ఉల్లంఘనకారులకు వ్యతిరేకంగా చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఈ ప్రకటన తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







