నకిలీ డిటర్జెంట్ ఫ్యాక్టరీ మూసివేత తర్వాత 10 మందికి జైలు శిక్ష
- June 13, 2017
అనుమతి లేని అక్రమ కర్మాగారాలలో నకిలీ డిటర్జెంట్లను తయారుచేసిన నేరంలో దోషులుగా నిర్ధారించిన తరువాత10 మంది నిందితులకు ఒకొక్కరికి 90 నెలల జైలుశిక్ష విధిస్తూ రియాద్ లోని క్రిమినల్ కోర్టు తీర్పు వెలువరించింది. అంతేకాక ప్రతి నిందితుడు ఆరు నుంచి 18 నెలల మధ్య జైలుశిక్షను మరియు 100,000 సౌదీ రియాళ్లను ( 26,700 డాలర్లను) జరిమానా సౌదీ అరేబియా వాణిజ్య మరియు పెట్టుబడుల మంత్రిత్వ శాఖ విధించింది.ఒక సౌదీ దేశీయుడు, ఇద్దరు సిరియన్లు, ఇద్దరు ఇథియోపియన్లు మరియు ఐదుగురు ఇథియోపియన్ మహిళలతో ఈ ముఠా రూపొందించబడింది.10 ఏళ్ళ జైలుశిక్ష పూర్తి చేసిన అనంతరం 9 మంది విదేశీ నేరస్తులను దేశ బహిష్కరణ చేయనున్నారు. ఈ పది మంది నేరస్థులను నకిలీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి, నకిలీ డిటర్జెంట్లను ఉత్పత్తి చేయడమే కాక నకిలీ ట్రేడ్మార్క్లను ఉపయోగించారు. వినియోగదారులను రక్షించడానికి, వాణిజ్య వ్యతిరేక మోసం చట్టాలు మరియు ట్రేడ్మార్క్ వ్యవస్థ యొక్క దుర్వినియోగం తదితర ఉల్లంఘనను నివారించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను అడ్డుకొంటామని సౌదీ అరేబియావాణిజ్య మరియు పెట్టుబడుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
అలాగే, వినియోగదారుల ఆరోగ్య భద్రతకు హాని కలిగించి వినియోగదారులను మోసగించడానికి ప్రయత్నించే ఉల్లంఘనకారులకు వ్యతిరేకంగా చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఈ ప్రకటన తెలిపింది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









