కొత్త 'రవీంద్ర భారతి'కి సి. నారాయణరెడ్డి పేరు
- June 13, 2017
మహాకవి, సాహితీవేత్త డాక్టర్ సి. నారాయణరెడ్డి విగ్రహన్ని ట్యాంక్బండ్పై ప్రతిష్టిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
హైదరాబాద్ నగరంలో సినారె స్మారక మ్యూజియం, రవీంద్రభారతి తరహాలో సాహితీ సమావేశమందిరం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ లోని ఒక ప్రముఖ సంస్థకు లేదా యూనివర్శిటీకి సినారె పేడతామని కేసీఆర్ చెప్పారు.
సాహితీ మకుటంలో సినారె కలికితురాయన్న ముఖ్యమంత్రి, సినారె మాట, సభ అంటే ఒక గ్లామర్ అని చెప్పారు. సినారె అంత్యక్రియల్లో పాల్గొనే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. సినారె పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సినారె సభలకు వందలాది మంది వచ్చేవారని గుర్తు చేశారు. ఆది ప్రాసలకు అంత్య ప్రాసలకు అద్భుతమైన నడక నేర్పడంలో వారికి వారే సాటి. సినారెకు ఎవరూ పోటీలేరని కేసీఆర్ అన్నారు.
బుధవారం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో జరిగే అంత్యక్రియలకు అన్ని జిల్లాల నుంచి సినారె అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తరుఫున వారికి ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









