కొత్త 'రవీంద్ర భారతి'కి సి. నారాయణరెడ్డి పేరు
- June 13, 2017
మహాకవి, సాహితీవేత్త డాక్టర్ సి. నారాయణరెడ్డి విగ్రహన్ని ట్యాంక్బండ్పై ప్రతిష్టిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
హైదరాబాద్ నగరంలో సినారె స్మారక మ్యూజియం, రవీంద్రభారతి తరహాలో సాహితీ సమావేశమందిరం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ లోని ఒక ప్రముఖ సంస్థకు లేదా యూనివర్శిటీకి సినారె పేడతామని కేసీఆర్ చెప్పారు.
సాహితీ మకుటంలో సినారె కలికితురాయన్న ముఖ్యమంత్రి, సినారె మాట, సభ అంటే ఒక గ్లామర్ అని చెప్పారు. సినారె అంత్యక్రియల్లో పాల్గొనే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. సినారె పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సినారె సభలకు వందలాది మంది వచ్చేవారని గుర్తు చేశారు. ఆది ప్రాసలకు అంత్య ప్రాసలకు అద్భుతమైన నడక నేర్పడంలో వారికి వారే సాటి. సినారెకు ఎవరూ పోటీలేరని కేసీఆర్ అన్నారు.
బుధవారం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో జరిగే అంత్యక్రియలకు అన్ని జిల్లాల నుంచి సినారె అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తరుఫున వారికి ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







