కొత్త 'రవీంద్ర భారతి'కి సి. నారాయణరెడ్డి పేరు
- June 13, 2017
మహాకవి, సాహితీవేత్త డాక్టర్ సి. నారాయణరెడ్డి విగ్రహన్ని ట్యాంక్బండ్పై ప్రతిష్టిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
హైదరాబాద్ నగరంలో సినారె స్మారక మ్యూజియం, రవీంద్రభారతి తరహాలో సాహితీ సమావేశమందిరం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ లోని ఒక ప్రముఖ సంస్థకు లేదా యూనివర్శిటీకి సినారె పేడతామని కేసీఆర్ చెప్పారు.
సాహితీ మకుటంలో సినారె కలికితురాయన్న ముఖ్యమంత్రి, సినారె మాట, సభ అంటే ఒక గ్లామర్ అని చెప్పారు. సినారె అంత్యక్రియల్లో పాల్గొనే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. సినారె పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సినారె సభలకు వందలాది మంది వచ్చేవారని గుర్తు చేశారు. ఆది ప్రాసలకు అంత్య ప్రాసలకు అద్భుతమైన నడక నేర్పడంలో వారికి వారే సాటి. సినారెకు ఎవరూ పోటీలేరని కేసీఆర్ అన్నారు.
బుధవారం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో జరిగే అంత్యక్రియలకు అన్ని జిల్లాల నుంచి సినారె అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తరుఫున వారికి ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









