శంషాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
- June 13, 2017
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఎనిమిది అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం దాదాపు ఆరు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలు.. ఎనిమిది అంతస్తుల భవనంలో అనుపమ రెసిడెన్సీ లాడ్జీని నిర్వహిస్తున్నారు. కొన్ని ఫ్లోర్లను ఇతర పనులకు అద్దెకు ఇచ్చారు. ఈ క్రమంలో నేటి ఉదయం భవనంలోని రెండో అంతస్తులో అకస్మాత్తుగా మంటలు ప్రారంభమయ్యాయి. అంతలోనే మరో మూడు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. లాడ్జీలో 50 మందికి పైగా చిక్కుకున్నట్లు సమాచారం.
తొలుత స్థానికుల సాయంతో కేవలం హోటల్ సిబ్బంది స్వయంగా మంటలు ఆర్పేందుకు తీవ్ర యత్నాలు చేసింది. అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకునేలోగానే భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. మూడో అంతస్తులో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రి మంటల్లో కాలి బూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది ఆ హోటల్లో ఉన్న వారిని సురక్షితంగా భయటకు చేర్చింది. కొంత సమయం శ్రమించిన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. అయితే ఈ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు భయటకు వెళ్లేందుకు ఉండే.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదని స్థానికులు చెబుతున్నారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







