విశ్రాoతి గదిలో చనిపోయిన ప్రవాస భారతీయుడు
- June 13, 2017
బహ్రెయిన్:బతుకు తెరువు కోసం కుటుంబ సభ్యులను వదిలి ఎడారి దేశాలలో రేయంబగళ్లు పనిచేసే పలువురు కార్మికుల జీవితాలు అర్దాయుస్సుతో విషాదంగా ముగిసిపోతున్నాయి. ఆ జాబితాలో మంగళవారం మరో ప్రవాస భారతీయుడు చేరాడు. ఎవరికీ తెలియకుండా ఒక విశ్రాoతి గదిలో ఆయన చనిపోయినట్లు తోటి కార్మికులు కనుగొన్నారు.ఒక కాంట్రాక్టు సంస్థలో పనిచేసి సేవ్య రాథవన్ మృతి చెందినట్లుగా ఉదయం 10.45 గంటలకు వైద్యులు ప్రకటించారు "తనకు ఆరోగ్యం బాగోలేదని తనపై అధికారి సూపర్వైజర్ కు ఫిర్యాదు చేశాడు ఒకపూట శెలవు తీసుకోమని ఆ పర్యవేక్షకుడు ఆయనకు అనుమతి ఇచ్చారు. దీంతో నేరుగా విశ్రాoతి గదికి వెళ్ళి సేవ్య రాథవన్ పడుకొన్నారు. అయితే ఎంతసేపటికి ఆయన నిద్ర లేకపోవడంతో సహోద్యోగులు విశ్రాoతి గది తలుపులు పగలకొట్టి లోనికి ప్రవేశించారు, సేవ్య రాథవన్ నేల మీద అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గమనించి ఆయనను కార్మిక శిభిరంలోని ఆసుపత్రికి తక్షణమే తరలించారు. కానీ, అక్కడ వైద్యులు సేవ్య రాథవన్ అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ప్రవాస భారతీయుడు మరణించినట్లు వైద్యులు తర్వాత నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







