తయ్యిబా గ్రూప్ నుంచి ప్రతిరోజూ 300 ఇఫ్తార్ మీల్స్
- June 14, 2017
తయ్యిబా అనే స్వచ్ఛంద సంస్థ రాయల్ ఒమన్ పోలీసులతో కలిసి 300 ఇఫ్తార్ మీల్ ప్యాకెట్స్ని సుర్ ప్రాంతంలో పంపిణీ చేస్తోంది. అలాగే ఈ సంస్థ సేఫ్ డ్రైవింగ్ క్యాంపెయిన్ని కూడా చేపడుతోంది. ప్రమాదాల్లేని రమదాన్ అనే నినాదంతో ఈ క్యాంపెయిన్ని చేపట్టారు. టీమ్ సూపర్వైజర్ వాలిద్ ఫాయెజ్ ముబారక్ అల్ హజ్రి మాట్లాడుతూ, 2014లో ఏర్పాటయిన తమ టీమ్లో 30 మంది సభ్యులున్నారని చెప్పారు. సుర్ స్పోర్ట్స్ క్లబ్కి పనిచేస్తున్న తమ మెంబర్స్ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మీల్స్ ప్రిపేర్ చేసి, మఘ్రిబ్ ప్రేయర్ అనంతరం వాటిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సకి అల్ సాయిమ్ పేరుతో తమ సభ్యులు మాస్క్ల వద్ద వాటర్ బాటిల్స్ని కూడా సరఫరా చేస్తున్నట్లు మరో మెంబర్ చెప్పారు. రమదాన్ తర్వాత, మాస్ వెడ్డింగ్స్ని నిర్వహించనున్నట్లు మజ్రి పేర్కొన్నారు. తమకు మొదట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయనీ, ఇప్పుడు ఒమన్ ఎల్ఎన్జి, ఒమన్ ఇండియన్ ఫెర్టిలైజర్ కంపెనీ వంటి సంస్థలు తమకు మద్దఉతగా నిలవడంతో ఆర్థిక ఇబ్బందులు తొలగి, సేవా కార్యక్రమాల్ని ముమ్మరంగా చేయగలుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







