ఫాస్టింగ్తో క్యాబ్ డ్రైవర్లలో పెరిగిన ఏకాగ్రత
- June 14, 2017
పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఉపవాసాలు ఉండటం ముస్లిం సమాజంలో ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉపవాసాలు క్యాబ్ డ్రైవర్లలో అనూహ్య మార్పుల్ని తీసుకొస్తున్నాయి. ఏకాగ్రత, చిత్తశుద్ధి పెరిగి, బాధ్యతాయుతంగా తాము వ్యవహరిస్తున్నట్లు క్యాబ్ డ్రైవర్లు పేర్కొన్నారు. ఉపవాసం మొదట్లో కొంచెం నీరసంగా అన్పించినా, ఆ తర్వాత ఆ నీరసం తమ దరిచేరదని ఇండియా నుంచి వచ్చిన ఓ క్యాబ్ డ్రైవర్ చెప్పారు. ఉపసవాస దీక్ష ముగిసిన అనంతరం ఇఫ్తార్ మీల్స్ అందకపోయినప్పటికీ తమలో ఉపవాసం తాలూకు నిరసం కనిపించడంలేదని ఇంకొందరు అంటున్నారు. ఇఫ్తార్ సమయానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న ఇఫ్తార్ మీల్స్ ఎంతో ఉపయోగరంగా ఉంటున్నాయని మరికొందరు క్యాబ్ డ్రైవర్లు చెప్పారు. పవిత్ర రమదాన్ మాసంలో ఉపవాసంతో క్రమబద్ధమైన మంచి జీవన క్రమం అలవాటవుతుందని ఎక్కువమంది క్యాబ్ డ్రైవర్లు అభిప్రాయపడుతున్నారు. దోహా సహా పలు నగరాల్లోని పలు హోటళ్ళు రమదాన్ ఇఫ్తార్ పార్సిల్స్ని ట్యాక్సీ డ్రైవర్ల కోసం ఉచితంగా అందిస్తున్నాయి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









