చైనాలోఅద్భుతం 3.5 సెకన్లలో బ్రిడ్జిని పేల్చేసిన ఇంజనీర్లు

- June 14, 2017 , by Maagulf
చైనాలోఅద్భుతం 3.5 సెకన్లలో బ్రిడ్జిని పేల్చేసిన ఇంజనీర్లు

ఒక్క బిల్డింగ్‌ను బ్లాస్టింగ్ చేసి కూల్చడానికి మనవాళ్లు ఆపసోపాలు పడితే.. 150 మీటర్ల పొడవైన వంతెనను కేవలం మూడున్నర సెకన్లలో కూల్చేశారు చైనా ఇంజనీర్లు. ఈశాన్య చైనాలో శిధిలావస్థకు చేరిన 39 ఏళ్ల బ్రిడ్జిని తొలగించి దాని స్థానంలో కొత్త బ్రిడ్జిని నిర్మించడానికి సిద్ధమయ్యారు. దీనికోసం.. దాదాపు 7వందల కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించి బ్రిడ్జిని పేల్చేశారు. వంతెన పూర్తిగా పేలడానికి కేవలం 3.5 సెకన్ల సమయమే పట్టింది. శిధిలాలను తొలగించడానికి మాత్రం నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు అధికారులు. విశాలంగా ఉండే కొత్త బ్రిడ్జిని ఈ సెప్టెంబర్‌ కల్లా సిద్దం చేస్తామంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com