రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్

- June 14, 2017 , by Maagulf
రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్

రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది. దీంతో ఎన్నికల సంఘం కొత్త రాష్ట్రపతి కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రపతి అభ్యర్థికి పోటీ పడే వారు ఈనెల 28లోపు తమ నామినేషన్లు వేయాలి. ఈనెల 29న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జూలై 1లోపు నామినేషన్లను విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిలిస్తే.. జూలై 17న ఎన్నికలు జరగనున్నాయి. జూలై 20న ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com