యూఎస్లో మరో భారతీయుడి కాల్చివేత
- June 14, 2017
అమెరికాలోవున్న భారతీయులకు రక్షణ లేకుండా పోతోంది. గడచిన 5 నెలల్లో ముగ్గురు భారతీయులపై దాడులు జరగ్గా, తాజాగా మరో భారతీయుడిని పొట్టన పొట్టుకున్నారు దుండగులు. అట్లాంటాలోని డిపార్ట్మెంటల్ స్టోర్స్లో పనిచేస్తున్న 24 ఏళ్ల యువకుడిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు.
గుజరాత్లోని పటాన్ జిల్లా సుంథేర్ ప్రాంతానికి చెందిన సమీర్ పటేల్, ఉద్యోగం కోసం అమెరికాకి వెళ్లాడు. ఆ తర్వాత ఓ డిపార్ట్మెంటల్ స్టోర్స్లో వర్క్ చేస్తున్నాడు. సోమవారం రాత్రి స్టోర్స్ మూసివేస్తున్న సమయంలో అందులోకి చొరబడ్డారు దుండగులు. అతడి నుంచి క్యాష్ రిజిస్ట్రర్ లాక్కునేందుకు ప్రయత్నించగా, వాళ్లని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే దుండగులు సమీర్పై కాల్పులకు దిగడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. సమీర్ విషయం తెలియగానే అతడి కుటుంబసభ్యులు అట్లాంటా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం









