అమ్నెస్టీ: 400,000 ఉల్లంఘనుల ఎగ్జిట్
- June 14, 2017
రియాద్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) మేజర్ జనరల్ సులైమాన్ అల్ యాహ్యా మాట్లాడుతూ, మూడు నెలల అమ్నెస్టీని వినియోగించుకుని 400,000 మంది ఉల్లంఘనులు దేశం విడిచి వెళ్ళారని చెప్పారు. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 404,253 మంది లేబర్ మరియు రెసిడెన్సీ లా ఉల్లంఘనులు అమ్నెస్టీ పీరియడ్ ద్వారా లబ్ది పొందారు. మక్కా సమీపంలోని షమైసిలోగల జవజత్ డిటెన్షన్ సెంటర్ - జనరల్ సర్వీస్ సెంటర్ని పర్యటించిన సందర్భంగా అల్ యహ్యా ఈ వివరాలు వెల్లడించారు. అమ్నెస్టీలో మిగిలిన 13 రోజుల్ని వినియోగించుకుని, ఈలోగా ఉల్లంఘనులు లబ్ది పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో అమ్నెస్టీ తర్వాత చట్ట పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారాయన.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







