భార్య మరణం: ఆసుపత్రిపై ఫిర్యాదు
- June 14, 2017
అబుదాబీ:అబుదాబీకి చెందిన ఓ వ్యక్తి, తన భార్య మృతికి కారణమయ్యిందంటూ ఆమెకు వైద్య చికిత్సనందించిన ఆసుపత్రిపై ఫిర్యాదు చేశారు. మెడికల్ నెగ్లిజెన్స్ కారణంగా తన భార్య మృతి చెందిందని ఆ వ్యక్తి ఆరోపించడం జరుగుతోంది. క్యాన్సర్తో బాధపడుతున్న ఓ మహిళ ఆసుపత్రిలో చేరగా, ఆసుపత్రి యాజమాన్యం పలు పరీక్షలు చేసి, క్యాన్సర్కి కాకుండా వేరే సమస్య అని చెప్పి ట్రీట్మెంట్ చేశారనీ, ఈ క్రమంలోనే క్యాన్సర్ మరింతగా వ్యాప్తి చెంది ఆమె మృతి చెందడానికి కారణమయ్యిందని న్యాయస్థానంలో ఫిర్యాదుదారుడి తరఫున వాదనలు విన్పించారు. అయితే ఆసుపత్రి యాజమాన్యం, అలాగే చికిత్స చేసిన డాక్టర్ ఈ వాదనల్ని కొట్టి పారేశారు. ఇందులో మెడికల్ నెగ్లిజెన్స్ ఏమీ లేదని చెప్పారు. మెడికల్ కమిటీని ఏర్పాటు చేసిన న్యాయస్థానం, ఈ కేసుని పరిశీలించాల్సిందిగా ఆదేశించింది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







