భార్య మరణం: ఆసుపత్రిపై ఫిర్యాదు

- June 14, 2017 , by Maagulf
భార్య మరణం: ఆసుపత్రిపై ఫిర్యాదు

అబుదాబీ:అబుదాబీకి చెందిన ఓ వ్యక్తి, తన భార్య మృతికి కారణమయ్యిందంటూ ఆమెకు వైద్య చికిత్సనందించిన ఆసుపత్రిపై ఫిర్యాదు చేశారు. మెడికల్‌ నెగ్లిజెన్స్‌ కారణంగా తన భార్య మృతి చెందిందని ఆ వ్యక్తి ఆరోపించడం జరుగుతోంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళ ఆసుపత్రిలో చేరగా, ఆసుపత్రి యాజమాన్యం పలు పరీక్షలు చేసి, క్యాన్సర్‌కి కాకుండా వేరే సమస్య అని చెప్పి ట్రీట్‌మెంట్‌ చేశారనీ, ఈ క్రమంలోనే క్యాన్సర్‌ మరింతగా వ్యాప్తి చెంది ఆమె మృతి చెందడానికి కారణమయ్యిందని న్యాయస్థానంలో ఫిర్యాదుదారుడి తరఫున వాదనలు విన్పించారు. అయితే ఆసుపత్రి యాజమాన్యం, అలాగే చికిత్స చేసిన డాక్టర్‌ ఈ వాదనల్ని కొట్టి పారేశారు. ఇందులో మెడికల్‌ నెగ్లిజెన్స్‌ ఏమీ లేదని చెప్పారు. మెడికల్‌ కమిటీని ఏర్పాటు చేసిన న్యాయస్థానం, ఈ కేసుని పరిశీలించాల్సిందిగా ఆదేశించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com