వినోదం, యాక్షన్, థ్రిల్తో హీరో ఆశిష్ రాజ్ రెండో చిత్రం ప్రారంభం
- June 14, 2017
ఆకతాయి చిత్రంతో ఆకట్టుకొన్న కథానాయకుడు ఆశిష్ రాజ్. తొలి సినిమాతోనే డాన్స్, యాక్షన్, నటన... ఇలా అన్ని విభాగాల్లోనూ తన ప్రతిభ చాటుకొన్నాడు. ఇప్పుడు రెండో చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. ఆకతాయి నిర్మించిన వికెఏ ఫిల్మ్స్ ఈ చిత్రాన్నీ రూపొందించనుంది. సుబ్రహ్మణ్యం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ముంబైకి చెందిన సిమ్రన్ ఈ చిత్రంతో కథానాయిగా పరిచయం కానుంది. ఈనెలలోనే ముహూర్తం జరుపుకొని, జులైలో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లనుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్, కౌశల్, అనిల్ మాట్లాడుతూ ``ఆశిష్ రాజ్ కోసం చాలా కథలు విన్నాం. అందులో సుబ్రహ్మణ్యం చెప్పిన ఈ కథ బాగా నచ్చింది. గ్రామీణ, పట్టణ నేపథ్యంలో జరిగే ప్రేమ కథ ఇది. వినోదం, యాక్షన్, థ్రిల్ ఇలా అన్నింటికీ చోటుంది. బడ్జెట్ పరంగా, క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడకుండా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. అందమైన లొకేషన్లలో పాటల్ని పూర్తి చేస్తాం. మూడు షెడ్యూళ్లలో ఈ సినిమాని పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేస్తాం. మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం`` అన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం









