'గల్ఫ్' సినిమా తీసినందుకు గర్విస్తున్నాం
- June 14, 2017
- సునీల్కుమార్రెడ్డి
ఎడారి దేశాలకు వలస వెళ్లిన లక్షలాది మంది తెలుగువారి జీవన స్థితిగతులను, గల్ఫ్లో వారి భావోద్వేగాలను ఒక ప్రేమకథ నేపథ్యంలో చూపించే సినిమా ‘గల్ఫ్’. పి. సునీల్కుమార్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చేతన మద్దినేని, డింపుల్ జంటగా నటించారు. ‘సరిహద్దులు దాటిన ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. జర్నలిస్ట్ పులగం చిన్నారాయణ మాటలు సమకూర్చిన ఈ చిత్రాన్ని జూలై రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో సునీల్కుమార్రెడ్డి మాట్లాడుతూ ‘‘గల్ఫ్లో ఇరవై ఐదు లక్షలమంది తెలుగువారు జీవిస్తున్నారు. మేం నాలుగొందల కుటుంబాలను కలిసి, మాట్లాడి తయారుచేసుకొన్న కథతో ఈ సినిమా చేశాం. ‘గల్ఫ్’ను తీసినందుకు గర్విస్తున్నాం. ఒక ఎమోషనల్ లవ్స్టోరీగా ఈ సినిమాని రూపొందించాం’’ అని చెప్పారు.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









