'గల్ఫ్‌' సినిమా తీసినందుకు గర్విస్తున్నాం

- June 14, 2017 , by Maagulf
'గల్ఫ్‌' సినిమా తీసినందుకు గర్విస్తున్నాం

- సునీల్‌కుమార్‌రెడ్డి
ఎడారి దేశాలకు వలస వెళ్లిన లక్షలాది మంది తెలుగువారి జీవన స్థితిగతులను, గల్ఫ్‌లో వారి భావోద్వేగాలను ఒక ప్రేమకథ నేపథ్యంలో చూపించే సినిమా ‘గల్ఫ్‌’. పి. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రావ్య ఫిలిమ్స్‌ పతాకంపై యక్కలి రవీంద్రబాబు, యమ్‌. రామ్‌కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చేతన మద్దినేని, డింపుల్‌ జంటగా నటించారు. ‘సరిహద్దులు దాటిన ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. జర్నలిస్ట్‌ పులగం చిన్నారాయణ మాటలు సమకూర్చిన ఈ చిత్రాన్ని జూలై రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో సునీల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘గల్ఫ్‌లో ఇరవై ఐదు లక్షలమంది తెలుగువారు జీవిస్తున్నారు. మేం నాలుగొందల కుటుంబాలను కలిసి, మాట్లాడి తయారుచేసుకొన్న కథతో ఈ సినిమా చేశాం. ‘గల్ఫ్‌’ను తీసినందుకు గర్విస్తున్నాం. ఒక ఎమోషనల్‌ లవ్‌స్టోరీగా ఈ సినిమాని రూపొందించాం’’ అని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com