శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి

- October 12, 2015 , by Maagulf
శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై మన్మథనామ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు మంగళవారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. భవానీ దీక్ష మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి పూజాధికాలు నిర్వహించి అర్చకస్వాములు ఉత్సవాలను ప్రారంభించారు. అంతరాలయంలో స్నపనాభిషేకం నిర్వహించిన అనంతరం జగన్మాత దుర్గమ్మను స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించారు. ఉదయం 9గంటల తర్వాత భక్తులను దర్శననానికి అనుమతించారు. తొలిరోజు దాదాపు 50,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు దేవస్థానం ఈవో నర్సింగరావు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com