'ఒంటరి' ఖతార్తో అగ్రరాజ్యం అమెరికా ఒప్పందం
- June 15, 2017
ఉగ్రవాదానికి మద్దతిస్తుందంటూ అరబ్ దేశాలు ఖతార్తో తెగదెంపులు చేసుకోగా.. అగ్రరాజ్యం అమెరికా మాత్రం ఆ దేశానికి దౌత్యపరమైన మద్దతిస్తున్నట్లు కన్పిస్తోంది. త్రీవ దౌత్య సంక్షోభంలో ఉన్న ఖతార్.. అమెరికాతో 12 బిలియన్ డాలర్ల (సుమారు రూ.77వేల కోట్లు) ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు అమెరికా నుంచి 36 ఎఫ్-15 జెట్ విమానాలను కొనుగోలు చేసేందుకు ఖతార్ 12 బిలియన్ డాలర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయమై వాషింగ్టన్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో అమెరికా, ఖతార్ రక్షణ మంత్రులు జిమ్ మ్యాటీస్, ఖలీద్ అల్-అథియా ఒప్పందంపై సంతకాలు చేశారు. అయితే ఉగ్రవాదంపై మూకుమ్మడిగా పోరాడాలని పిలుపునిచ్చిన అమెరికా ఇప్పుడు.. ఖతార్తో ఒప్పందం కుదుర్చుకోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఉగ్రవాదానికి మద్దతివ్వడంతో పాటు తమను అస్థిరపరచడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ.. ఇటీవల నాలుగు అరబ్ దేశాలు ఖతార్తో సంబంధాలు తెంచుకున్న విషయం తెలిసిందే. సౌదీ అరేబియాతో పాటు ఈజిప్ట్, యూఏఈ, బహ్రెయిన్ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీఅరేబియాలో పర్యటించిన సందర్భంగా..
ఉగ్రవాదంపై పోరులో ముస్లిం దేశాలన్నీ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే అరబ్ దేశాలు ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇరాన్ మద్దతుతో ఇస్లామిక్స్టేట్ లాంటి ఉగ్రవాద సంస్థలకు ఖతార్ మద్దతిస్తోందని అరబ్ దేశాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఖతార్తో దౌత్యసంబంధాలు తెంచుకోవడంతో పాటు ఆ దేశానికి వెళ్లే రవాణా వ్యవస్థను కూడా నిలిపివేశాయి.
తమ పౌరులు ఖతార్కు వెళ్లరాదని సౌదీ అరేబియా ఆంక్షలు విధించింది. ఖతార్తో ఉన్న సరిహద్దులను అరబ్దేశాలు మూసివేశాయి. విమాన సర్వీసులను కూడా నిలిపివేశాయి. దీంతో ఖతార్లో దౌత్య సంక్షోభం ఏర్పడింది.
కాగా.. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







