సోషల్ మీడియా వినియోగదారులను పర్యవేక్షించేందుకు అధికారులు

- June 15, 2017 , by Maagulf
సోషల్ మీడియా వినియోగదారులను పర్యవేక్షించేందుకు అధికారులు

కువైట్: సామాజిక మాధ్యమాలలో ఇక  అవాకులు ..చెవాకులతో చెలరేగితే, చెరసాల ఖాయమంటున్నారు కువైట్ అధికారులు...సోషల్ మీడియాలో పుకార్లను వ్యాప్తి చేసేవారిని , ఇతర దేశాలపై వివిధ చేష్టలతో  దాడి చేయటం లేదా ఫోటోలు , వ్యాఖ్యలు ప్రాంతీయతత్వం  మరియు దేశద్రోహాన్ని ప్రేరేపించే విధంగా ప్రవర్తించే  సామాజిక మీడియా వాడుకదారులను ఇక  త్వరలోనే పర్యవేక్షించనున్నట్లు  స్థానిక స్థానిక మీడియా తెలిపింది.ఆ నివేదిక ప్రకారం, సామాజిక మాధ్యమాల పర్యవేక్షించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఆ కమిటీ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు మరియు ఇతర మీడియా వేదికలలో ప్రచురమయ్యే వివిధ  పోస్ట్ లను శ్రద్ధగా పరిశీలిస్తుంది. ఎవరైతే ఇతర దేశాల్లో దేశద్రోహ చర్యలు , ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడ్తూ పోస్టులు చేసే వ్యక్తులు మరియు వివిధ వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసే విధానాలను...వివిధ  వర్గాల మధ్య వివాదాలను మండించేందుకు ప్రయత్నిస్తున్నవారిని గుర్తించేందుకు ఈ కమిటీ దృస్టని నిశితంగా  కేంద్రీకరించనుంది. అదేవిధంగా పాల్పడే వారి సామాజిక మాధ్యమాల ఖాతాలను సేకరించి వారు  ఉల్లంఘనలకు పాల్పడినట్లు నిరూపించబదినట్లు పలు ఆధారాలు సేకరించి న్యాయవ్యవస్థకు నేరుగా నివేదించబడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com