సోషల్ మీడియా వినియోగదారులను పర్యవేక్షించేందుకు అధికారులు
- June 15, 2017
కువైట్: సామాజిక మాధ్యమాలలో ఇక అవాకులు ..చెవాకులతో చెలరేగితే, చెరసాల ఖాయమంటున్నారు కువైట్ అధికారులు...సోషల్ మీడియాలో పుకార్లను వ్యాప్తి చేసేవారిని , ఇతర దేశాలపై వివిధ చేష్టలతో దాడి చేయటం లేదా ఫోటోలు , వ్యాఖ్యలు ప్రాంతీయతత్వం మరియు దేశద్రోహాన్ని ప్రేరేపించే విధంగా ప్రవర్తించే సామాజిక మీడియా వాడుకదారులను ఇక త్వరలోనే పర్యవేక్షించనున్నట్లు స్థానిక స్థానిక మీడియా తెలిపింది.ఆ నివేదిక ప్రకారం, సామాజిక మాధ్యమాల పర్యవేక్షించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఆ కమిటీ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు మరియు ఇతర మీడియా వేదికలలో ప్రచురమయ్యే వివిధ పోస్ట్ లను శ్రద్ధగా పరిశీలిస్తుంది. ఎవరైతే ఇతర దేశాల్లో దేశద్రోహ చర్యలు , ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడ్తూ పోస్టులు చేసే వ్యక్తులు మరియు వివిధ వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసే విధానాలను...వివిధ వర్గాల మధ్య వివాదాలను మండించేందుకు ప్రయత్నిస్తున్నవారిని గుర్తించేందుకు ఈ కమిటీ దృస్టని నిశితంగా కేంద్రీకరించనుంది. అదేవిధంగా పాల్పడే వారి సామాజిక మాధ్యమాల ఖాతాలను సేకరించి వారు ఉల్లంఘనలకు పాల్పడినట్లు నిరూపించబదినట్లు పలు ఆధారాలు సేకరించి న్యాయవ్యవస్థకు నేరుగా నివేదించబడతాయి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







