డిసెంబర్ 17 అమరవీరుల దినోత్సవం.!
- October 13, 2015
డిసెంబర్ 17వ తేదీని జాతీయ అమరవీరుల దినోత్సవంగా నిర్వహించనున్నట్లు కింగ్ హమాద్ వెల్లడించారు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్ మరియు డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ మరియు ఫస్ట్ డిప్యూటీ ప్రీమియర్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా సమక్షంలో ఈ నిర్ణయాన్ని కింగ్ ప్రకటించారు. వివిధ పథకాల్ని అమలు చేసే క్రమంలో ప్రజా ప్రతినిథులు చూపిస్తోన్న శ్రద్ధను కింగ్ హమాద్ కొనియాడారు. ఆర్థిక స్వావలంభన, ఆర్థిక వృద్ధి కోసం ఇంకా కృషి చేయవలసి ఉందని, ప్రభుత్వ ఇంకా మెరుగ్గా పనిచేసేందుకు కొన్ని శాఖల్ని విలీనం చేయడం జరిగిందన్నారాయన. యెమెన్లో శాంతి కోసం బహ్రెయిన్ సైనికులు చేస్తున్న కృషిని కింగ్ హమాద్ అభినందించారు. ఈ క్రమంలో వీరోచితంగా పోరాడి మరణించినవారికి కింగ్ హమాద్ సంతాపం వ్యక్తం చేశారు. దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు పెరగకుండా చేయడంలో భద్రతాదళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







