స్మార్ట్ బ్యాలన్స్ ప్రమాదకరం
- October 13, 2015
తమ పిల్లలు స్మార్ట్ బ్యాలన్స్ (హోవర్ బోర్డ్) ఉపయోగించడం పట్ల తల్లిదండ్రులు పూర్తి అవగాహనతో, జాగ్రత్తతో వ్యవహరించాలని అబుదాబీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆరేళ్ళ ఎమిరేటీ బాలుడు హోవర్ బోర్డ్ మీద వెళుతూ కారు ప్రమాదానికి గురై చనిపోవడంతో పోలీసులు, హోవర్ బోర్డ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అబుదాబీ ట్రాఫిక్ మరియు పెట్రోల్స్ డైరెక్టరేట్ పబ్లిక్ రిలేషన్స్ సెక్షన్ చీఫ్ కల్నల్ జమాల్ సలీమ్ అల్ అమెరి, అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు చెప్పారు. బ్యాటరీ ఆపరేటెడ్ హోవర్ బోర్డ్లతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన శిక్షణ తీసుకోకపోతే ప్రమాదాలు తప్పవని వారు అంటున్నారు. నిర్ణీత ప్రదేశాల్లో నిపుణుల సమక్షంలో హోవర్ బోర్డ్ వినియోగం తెలుసుకుని, ఆ తర్వాత రోడ్లపైకి రావాలనీ, వాహనాలు తిరగని ప్రదేశాల్లో మాత్రమే హోవర్ బోర్డ్ వినియోగించాలని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







