స్మార్ట్ బ్యాలన్స్ ప్రమాదకరం
- October 13, 2015
తమ పిల్లలు స్మార్ట్ బ్యాలన్స్ (హోవర్ బోర్డ్) ఉపయోగించడం పట్ల తల్లిదండ్రులు పూర్తి అవగాహనతో, జాగ్రత్తతో వ్యవహరించాలని అబుదాబీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆరేళ్ళ ఎమిరేటీ బాలుడు హోవర్ బోర్డ్ మీద వెళుతూ కారు ప్రమాదానికి గురై చనిపోవడంతో పోలీసులు, హోవర్ బోర్డ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అబుదాబీ ట్రాఫిక్ మరియు పెట్రోల్స్ డైరెక్టరేట్ పబ్లిక్ రిలేషన్స్ సెక్షన్ చీఫ్ కల్నల్ జమాల్ సలీమ్ అల్ అమెరి, అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు చెప్పారు. బ్యాటరీ ఆపరేటెడ్ హోవర్ బోర్డ్లతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన శిక్షణ తీసుకోకపోతే ప్రమాదాలు తప్పవని వారు అంటున్నారు. నిర్ణీత ప్రదేశాల్లో నిపుణుల సమక్షంలో హోవర్ బోర్డ్ వినియోగం తెలుసుకుని, ఆ తర్వాత రోడ్లపైకి రావాలనీ, వాహనాలు తిరగని ప్రదేశాల్లో మాత్రమే హోవర్ బోర్డ్ వినియోగించాలని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







