అమెరికాలో సినారెకు ఆటా ఘన నివాళి
- June 17, 2017
తెలుగు జాతి మనది.. నిండుగా వెలుగుజాతి మనది అంటూ యావత్ తెలుగుజాతికి స్ఫూర్తిగా నిలిచిన మహాకవి డా. సి.నారాయణరెడ్డి మృతి పట్ల అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) సంతాపాన్ని తెలిపింది. కెంటకీ, లెక్సింగ్టన్లో ఆటా సభ్యులు సాహితీ దిగ్గజం, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినారెకు శ్రద్ధాంజలి ఘటించారు. ఇక్కడి మసాలా ఇండియన్ రెస్టారెంట్లో ఆటా బృందంతో పాటు తెలుగు ఎన్నారైలు సినారెకు తుది నివాళులు అర్పించారు. తెలుగు సాహిత్యానికి సినారె అందించిన సేవల్ని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు కరుణాకర్ అసిరెడ్డి, టీడీఎఫ్ అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి అనుగు, మిమిక్రీ రమేశ్, అనిల్ బొడ్డిరెడ్డి, ఆటా స్టాండింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ తిరుపతిరెడ్డి ఎర్రంరెడ్డి, కెంటకీ రీజనల్ కో-ఆర్డినేటర్ మహేశ్ గుండ్లూరు, అనిల్ గంటేటి, ఆటా కార్యవర్గ బృందం హేమ ప్రసాద్ సడ్డాలా, బాబు కొండవీటి, సురేశ్.ఎం, డాక్టర్ రాపూరి, రమేశ్ సొంటేనమ్, రమేశ్ మల్నేని, నయన్.ఎం, సురేశ్ పొట్లూరీ, శ్రీని ఆకుల, పార్శి, శ్రీనివాస్ సత్రశాల, శ్రీనివాస్ రెడ్డి, లెక్సింగ్టన్ తెలుగు కమ్యూనిటీ సభ్యులు పాల్గొని సాహితీ శిఖరం సినారెకు శ్రద్ధాంజలి ఘటించారు. సినారె లేని లోటును ఎవరూ పూడ్చలేరన్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









