పోర్చుగల్ అడవుల్లో మంటలు: 57 మంది మృతి, కార్లలోనే 30 మంది.
- June 18, 2017
పోర్చుగల్ అడవుల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 57 మంది వరకు చనిపోయినట్లుగా తెలుస్తోంది. మంటలు రోడ్డు పక్కనే ఉన్న కార్లకు వ్యాపించడంతో ప్రాణాపాయం పెద్ద ఎత్తున సంభవించింది.
దాదాపు అరవై మంది గాయపడ్డారు. మంటలను అదుపు చేసేందుకు 160 అగ్నిమాపక యంత్రాలు, వందల సంఖ్యలో సిబ్బంది శ్రమిస్తుంది.
అడవుల్లో ఇంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం గత కొన్ని సంవత్సరాలుగా చూడలేదని ఆ దేశ ప్రధాని ఆంటోనియో కోస్టా అన్నారు. కార్లకు మంటలు వ్యాపించడంతో కార్లలో ఉన్న వ్యక్తులు కాలి బూడిదయ్యారని అధికారులు పేర్కొన్నారు. కార్లలో చనిపోయిన వారే 30 మందికి పైగా ఉన్నారని తెలుస్తోంది.
దట్టమైన పొగ కారణంగా మరికొందరు మృతి చెందారు. గాయపడిన వారిలో అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. అగ్ని ప్రమాదానికి మెరుపులే కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
అడవికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అడవుల్లో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు వాటర్ ప్లేన్స్ను ఉపయోగిస్తున్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







