హత్య కేసులో 30 మందికి మరణశిక్ష విధించిన ఈజిప్టు కోర్టు
- June 19, 2017
ఈజిప్టులోని ఉన్నతస్థాయి పబ్లిక్ ప్రాసిక్యూటర్ హత్య కేసులో 30 మందికి ఉరిశిక్ష వేయాల్సిందిగా అక్కడి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జూన్ 2015లో హిషం బారాకత్ అనే ఉన్నతస్థాయి పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కొంతమంది ప్రణాళిక ప్రకారం కారుబాంబు పేల్చి చంపేశారు. 2013లో ఈజిప్టులో ప్రభుత్వాన్ని కుప్పకూల్చటంలో పాలుపంచుకున్న అనేకమందిని కోర్టు ముంగిట దోషులుగా నిలబెట్టడంలో హిషం బారాకత్ సఫలీకృతులయ్యారు. దీనిపై కొన్ని మిలిటెంట్ గ్రూపులు ఆయనపై కక్ష్యగట్టాయి. ఈ కేసులో ప్రస్తుతం కోర్టు ఇచ్చిన మరణశిక్ష తీర్పునకు ఈజిప్టులోని ఉన్నతస్థాయి మతాధికారులతో కూడుకున్న 'గ్రాండ్ ముఫ్తీ' ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కోర్టు తీర్పును రద్దు చేసే అధికారం 'గ్రాండ్ ముఫ్తీ'కి ఉంది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









