హత్య కేసులో 30 మందికి మరణశిక్ష విధించిన ఈజిప్టు కోర్టు
- June 19, 2017
ఈజిప్టులోని ఉన్నతస్థాయి పబ్లిక్ ప్రాసిక్యూటర్ హత్య కేసులో 30 మందికి ఉరిశిక్ష వేయాల్సిందిగా అక్కడి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జూన్ 2015లో హిషం బారాకత్ అనే ఉన్నతస్థాయి పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కొంతమంది ప్రణాళిక ప్రకారం కారుబాంబు పేల్చి చంపేశారు. 2013లో ఈజిప్టులో ప్రభుత్వాన్ని కుప్పకూల్చటంలో పాలుపంచుకున్న అనేకమందిని కోర్టు ముంగిట దోషులుగా నిలబెట్టడంలో హిషం బారాకత్ సఫలీకృతులయ్యారు. దీనిపై కొన్ని మిలిటెంట్ గ్రూపులు ఆయనపై కక్ష్యగట్టాయి. ఈ కేసులో ప్రస్తుతం కోర్టు ఇచ్చిన మరణశిక్ష తీర్పునకు ఈజిప్టులోని ఉన్నతస్థాయి మతాధికారులతో కూడుకున్న 'గ్రాండ్ ముఫ్తీ' ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కోర్టు తీర్పును రద్దు చేసే అధికారం 'గ్రాండ్ ముఫ్తీ'కి ఉంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







