హత్య కేసులో 30 మందికి మరణశిక్ష విధించిన ఈజిప్టు కోర్టు

- June 19, 2017 , by Maagulf
హత్య కేసులో 30 మందికి మరణశిక్ష విధించిన ఈజిప్టు కోర్టు

ఈజిప్టులోని ఉన్నతస్థాయి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ హత్య కేసులో 30 మందికి ఉరిశిక్ష వేయాల్సిందిగా అక్కడి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జూన్‌ 2015లో హిషం బారాకత్‌ అనే ఉన్నతస్థాయి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను కొంతమంది ప్రణాళిక ప్రకారం కారుబాంబు పేల్చి చంపేశారు. 2013లో ఈజిప్టులో ప్రభుత్వాన్ని కుప్పకూల్చటంలో పాలుపంచుకున్న అనేకమందిని కోర్టు ముంగిట దోషులుగా నిలబెట్టడంలో హిషం బారాకత్‌ సఫలీకృతులయ్యారు. దీనిపై కొన్ని మిలిటెంట్‌ గ్రూపులు ఆయనపై కక్ష్యగట్టాయి. ఈ కేసులో ప్రస్తుతం కోర్టు ఇచ్చిన మరణశిక్ష తీర్పునకు ఈజిప్టులోని ఉన్నతస్థాయి మతాధికారులతో కూడుకున్న 'గ్రాండ్‌ ముఫ్తీ' ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కోర్టు తీర్పును రద్దు చేసే అధికారం 'గ్రాండ్‌ ముఫ్తీ'కి ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com