బాలీవుడ్ నటి కృతికా చౌదరి మృతి
- June 19, 2017
ఈ మద్య వెండి తెర, బుల్లి తెరపై విషాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. అనాలోచితంగా తీసుకుంటున్న నిర్ణయాలతో బంగారు భవిష్యత్ పాడు చేసుకుంటున్నారు. క్షణికావేషంతో నిండు ప్రాణాలను బలి చేసుకుంటున్నారు కొంత మంది సెలబ్రెటీలు. తాము అనుకున్న స్థాయిలో విజయాలు సాధించక కొంత మంది...ఇండస్ట్రీలో తమ కెరీర్ పాడైపోయిందని కొంత మంది..ప్రేమలో విఫలం కావడంతో కొంత మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ మద్య బాలీవుడ్ నటి కృతికా చౌదరి (30) ముంబైలోని అంధేరీ ప్రాంతంలోని తన ఇంట్లో అంతు చిక్కని పరిస్థితుల్లో విగతజీవిగా కనిపించింది.
కృతికా చౌదరి
అసలు విషయానికి వస్తే..కృతికా చౌదరిని ఎవరో అజ్ఞాత వ్యకులు బలమైన ఆయుధంతో కొట్టి చంపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం ఆ కేసు ఎంక్వెయిరీ నడుస్తుంది..ఇంతలోనే మరో వర్థమాన నటి అర్థరాతంరంగా తనువు చాలించింది. ముంబైలో ఈ మద్య మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న అంజలి శ్రీవాస్తవ పశ్చిమ అంధేరీలో తన అపార్ట్ మెంట్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుంది.
ఓ జాతీయ మీడియా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ట్వీట్ చేసింది. ఈ రోజు ఉదయం ముంబై పశ్చిమ అంధేరిలోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకున్నట్లు గుర్తించిన స్థానికులు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనకు చేరుకున్న పోలీసులకు కొన్ని అనుమానాలు కలిగించేలా ఉన్నాయని..అంజలి తన ఫ్లాట్ లో ఉరేసుకుని చనిపోయిందని చెబుతున్నప్పటికీ, శరీరం వేలాడి ఉన్న స్థితి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయినప్పటికీ, పోలీసులు కేసును సూసైడ్ గానే నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంజలి బాలీవుడ్ తోపాటు మరాఠీ, భోజ్ పురి చిత్రాల్లో సహాయక పాత్రలు చేసింది. ఆమె డెడ్ బాడీని కూపర్ ఆస్పత్రికి పోస్ట్ మార్టం కోసం పంపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు తెలిపారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









