'వాసుకి' చిత్రానికి లభించిన ఫిలింఫేర్ అవార్డ్
- June 19, 2017
స్టార్ హీరోయిన్ నయనతార టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 'వాసుకి'. మలయాళ చిత్రం `పుదియ నియమం` చిత్రానికి అనువాద చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నయనతార నటనకు ఈ ఏడాది ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డును నయనతార సొంతం చేసుకున్నారు. మహిళలపై జరగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడే ఓ స్త్రీ కథాంశంతో వాసుకి సినిమా రూపొందింది. మలయాళంలో ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించింది. `వాసుకి` పేరుతో శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్. మోహన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్కు ఆడియెన్స్ నుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. లీడ్ రోల్ నయనతార చేయడంతో పాటు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సమస్య కావడంతో సినిమాపై మంచి క్రేజ్ నెలకొంది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాపై ఆసక్తిని కనపరుస్తున్నారు.
నయనతారకు ఫిలింపేర్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది. మలయాళంలో బ్లాక్బస్టర్ హిట్ అయిన ఈ చిత్రానికి తెలుగులో మంచి క్రేజ్ నెలకొంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుందని నిర్మాత ఎస్.ఆర్.మోహన్ తెలిపారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







