అదా ప్రదమాన్ పాయసం
- June 19, 2017
కావలసిన పదార్థాలు: అటుకులు - 100 గ్రా, బెల్లం తరుగు - పావు కిలో, పల్చని కొబ్బరి పాలు - 5 కప్పులు, చిక్కని కొబ్బరి పాలు- 1 కప్పు, నెయ్యి-2 టే.స్పూన్లు, యాలకుల పొడి - అర టీస్పూను, జీలకర్ర పొడి - పావు టీస్పూను, కొబ్బరి ముక్కలు - 2 టే.స్పూన్లు, జీడిపప్పు, ఎండుద్రాక్ష - తగినన్ని
తయారీ విధానం:
బెల్లం కరిగించి పక్కన పెట్టుకోవాలి.
గిన్నెలో నీళ్లు వేడి చేసి మరిగాక మంట తీసి అటుకులు వేసి 15 నిమిషాలు నానబెట్టాలి.
తర్వాత పల్చని కొబ్బరి పాలు పోసి కలిపి చిన్న మంట మీద అటుకులు మెత్తబడేవరకూ ఉడికించాలి.
చిక్కబడ్డాక బెల్లం వేసి ఐదు నిమిషాలపాటు ఉడికించాలి.
మరో గిన్నెలో నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు వేయించి తీయాలి.
అలాగే జీడిపప్పు, ఎండుద్రాక్ష కూడా వేయించు కోవాలి.
అటుకులు మెత్తగా ఉడికిన తర్వాత చిక్కని కొబ్బరి పాలు పోసి మంట తీసేయాలి.
కొబ్బరి పాలు పోశాక ఉడికిస్తే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి పాలు పోసిన వెంటనే మంట తీసేయాలి.
దీన్లో వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష, కొబ్బరి ముక్కలు, యాలకుల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి వడ్డించాలి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









