ఇండోనేషియాలో దారుణం సొరంగం తవ్వి బాలిలో నలుగురు ఖైదీల పరారీ
- June 19, 2017
కిక్కిరిసి పోయిన జైలు నుండి తప్పించుకు పారిపోయిన నలుగురు విదేశీ ఖైదీల కోసం ఇండోనేషియా పోలీసులు గాలింపు ప్రారంభించారు. జైలు లోపల నుండి సొరంగాన్ని తవ్వి ఆ నలుగురు ఖైదీలు తప్పించుకు పారిపోయారని అధికారులు సోమవారం తెలిపారు. 39 అడుగుల పొడవైన సొరంగాన్ని తవ్వడానికి వారం రోజులు పట్టి వుంటుందని జైలు అధికారి పేర్కొన్నారు. తప్పించుకున్న ఆ ఖైదీలు ఇంకా బాలిలోనే వుండి వుంటారని, ఎక్కువ దూరం వెళ్ళి వుండరని అధికారులు భావిస్తున్నారు. ఆ నలుగురు ఆస్ట్రేలియా, బల్గేరియా, భారత్, మలేసియా జాతీయులని పోలీసు ప్రతినిధి చెప్పారు. సోమవారం ఉదయం చూసే నాటికి 50సెంటిమీటర్ల వ్యాసార్థంతో వున్న ఆ సొరంగం నిండా నీరు వుందని తెలిపారు. అంతర్జాతీయ పర్యాటక, రవాణా కేంద్రమైన బాలిలో విదేశీ ఖైదీలు ఎక్కువగానే వుంటారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘించడం నుండి మాదకద్రవ్యాల నేరాల వరకు వివిధ నేరాల్లో వీరు నలుగురు శిక్షను అనుభవిస్తున్నారు. ఆదివారం రాత్రి వీరు తప్పించుకున్నారని అనుమానిస్తున్నారు. ఆ సమయంలో 10మంది గార్డులు విధుల్లో వున్నారు.
కెరోబాకన్ జైలు సామర్ధ్యం 323 మంది ఖైదీలు కాగా, ప్రస్తుతం అందులో నాలుగు రెట్లు అంటే 1378మంది వున్నారని ప్రభుత్వ డేటా తెలియచేస్తోంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







