టీమిండియా శ్రీలంక పర్యటన ఖరారు, పూర్తి షెడ్యూల్ వివరాలు
- June 20, 2017
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసింది. ఈ టోర్నీ అనంతరం టీమిండియా వెస్టిండిస్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు వన్డేలు, ఒక టీ20 ఆడనుంది. జూన్ 23 నుంచి ప్రారంభంకానున్న వెస్టిండిస్ పర్యటన జులై 9తో ముగియనుంది.
వెస్టిండిస్ పర్యటన ముగిసిన తర్వాత 10 రోజుల విరామం అనంతరం టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. జూలై 21, 22న జరిగే వార్మప్ మ్యాచ్లతో శ్రీలంక పర్యటన ప్రారంభమవుతుంది. లంక పర్యటనలో టీమిండియా ఆతిథ్య జట్టుతో భారత్ 3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ20 ఆడనుంది.
దీనికి సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ సోమవారం విడుదల చేసింది. జులై 26 నుంచి సెప్టెంబరు 6 మధ్య ఈ మ్యాచ్లు జరగనున్నాయి. 2015లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన టెస్టు, వన్డే సిరీస్లను భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
పూర్తి షెడ్యూల్ వివరాలు:
వార్మప్ మ్యాచ్లు: జులై 21, 22 10 AM (IST)
టెస్టులు (10 AM (IST) గంటలకు ప్రారంభం)
మొదటి టెస్టు: జులై 26-30(క్యాండీ)
రెండో టెస్టు: ఆగస్టు 4-8(గాలే)
మూడో టెస్టు: ఆగస్టు 12-16(కొలంబో)
వన్డేలు (2.30 PM (IST) గంటలకు ప్రారంభం)
తొలి వన్డే: ఆగస్టు 20
రెండో వన్డే: ఆగస్టు 24
మూడో వన్డే: ఆగస్టు 27
నాలుగో వన్డే: ఆగస్టు 30
ఐదో వన్డే: సెప్టెంబరు 3
ఏకైక టీ20: సెప్టెంబరు 6 (7 PM (IST) గంటలకు ప్రారంభం)
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







