పార్కింగ్ ఏరియాలో మూత్ర విసర్జన: బోర్డుల ఏర్పాటు
- June 20, 2017
మనామా: మునిసిపల్ అథారిటీస్, రెండు పెద్ద పార్కింగ్ గ్రౌండ్స్ని క్లీన్ చేసి, అక్కడ 'మూత్ర విసర్జన' చేయొద్దంటూ బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ ఎవెన్యూ, రోడ్ నెంబర్ 453, బ్లాక్ 304 ఓపెన్ టాయిలెట్లుగా మారిపోయాయి. దాంతో అధికార వర్గాలు క్లీనింగ్ చర్యలకు ఉపక్రమించాయి. క్లీనింగ్ కంపెనీ రెండు పార్కింగ్ గ్రౌండ్స్ని క్లీన్ చేశాయి. మనామా బస్ స్టేషన్ ఎదురుగా ఈ క్లీనింగ్ కార్యక్రమం చేపట్టి, బ్యానర్లతోపాటు పోస్టర్లను ఏర్పాటు చేశారు. పబ్లిక్ ప్లేస్లలో బహిరంగ మూత్ర విసర్జన చేయరాదని వాటిల్లో పేర్కొన్నారు అధికారులు. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనీ, అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామని క్యాపిటల్ మున్సిపల్ కౌన్సిల్ ఛైర్మన్ మజెన్ అహ్మద్ అల్ ఒమ్రాన్ చెప్పారు. బహిరంగ మూత్ర విసర్జన కారణంగా అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయని ఆయన హెచ్చరించారు. పౌరులెవరైనా ఇటువంటి విషయాలపై తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు హాట్లైన్ని వినియోగించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







