యోగాతో ప్రపంచమంతా భారత్తో మమేకం: నరేంద్ర మోదీ
- June 20, 2017
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. 'ఆరోగ్యం కోసం యోగా' పేరిట బుధవారం మూడో అంతర్జాతీయ యోగా డేను జరుపుకుంటున్నారు. ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశంలో ఐదు వేళ చోట్ల యోగా డే కార్యక్రమాలు చేపట్టారు. నేటి ఉదయం లక్నోలోని రామాబాయ్ సభాస్థల్లో నిర్వహించిన యోగా డే వేడుకలలో ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. యోగా నిపుణుల పర్యవేక్షణలో వారి సూచనల ప్రకారం వేలాది ఔత్సాహికులతో కలిసి మోదీ, యోగి పలు రకాల యోగాసనాలు వేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ మీడియాతో మాట్లాడుతూ.. 'యోగాతో ప్రపంచమంతా భారత్తో మమేకమైంది. యోగాతో శారీరక, మానసిక వికాసం సాధ్యం. మూడేళ్లలో అనేక యోగా శిక్షణా సంస్థలు ఆవిర్భవించడం ఆనందదాయకం. ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో యోగాను భాగం చేసుకోవాలని' దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. యోగాలో ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయని, ప్రతిరోజు తప్పనిసరిగా యోగి చేయడం ద్వారా అందరూ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







