బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ రైల్వే స్టేషన్పై ఉగ్రదాడి

- June 20, 2017 , by Maagulf
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ రైల్వే స్టేషన్పై ఉగ్రదాడి

బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ రైల్వే స్టేషన్పై ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తిని సైనికులు కాల్చివేశారు. మంగళవారం రాత్రి బ్రస్సెల్స్ స్టేషన్లోకి ప్రవేశించిన ఒక వ్యక్తి సూట్కేసు బాంబును పేల్చాడు. దీంతో అప్రమత్తమైన సైనికులు అతన్ని కాల్చివేశారు. అతను ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు వినియోగించే కోటును ధరించినట్లు అనుమానిస్తున్నారు. అనుమానితుడు పేలుడుకు పాల్పడే ముందు అరబిక్ భాషలో దేవుడు గొప్పవాడు అని అరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
2016 మార్చిలో బ్రస్సెల్స్లో జరిగిన ఉగ్రదాడిలో 32 మంది మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో అక్కడ భద్రతా దళాలు అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com