యూఏఈలో ప్రపంచ యోగా దినోత్సవం: వేలాదిమంది హాజరు
- June 21, 2017
దుబాయ్:ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం పెద్ద సంఖ్యలో యూఏఈ వ్యాప్తంగా యోగాసనాల్లో మునిగి తేలారు. మూడో ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. 2014లో జూన్ 21వ తేదీని ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న చర్యల నేపథ్యంలో యోగాకి ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిందనడం నిస్సందేహం. 5 వేల సంవత్సరాలకు పూర్వమే యోగా, భారత సంస్కృతీ సంప్రదాయాలు, జీవన శైలిలో భాగమైంది. యోగా అనేది ఓ ఆరోగ్యకరమైన జీవన విధానంగా ప్రపంచ దేశాలు గుర్తించాయి. యూఏఈ వ్యాప్తంగా ఈసారి చాలా ప్రాంతాల్లో యోగాసనాల కోసం ఏర్పాట్లు జరిగాయి. దుబాయ్లో బుర్జ్ పార్క్, జబీల్ పార్క్, బురమైమీ కాంప్లెక్స్ సహా పలు చోట్ల యోగాసన కార్యక్రమాలు జరిగాయి. ఇండియన్ కాన్సులేట్ జనరల్, స్థానిక స్కూల్స్ మరియు యోగా అసోసియేషన్స్తో కలిసి దుబాయ్లో యోగా దినోత్సవ వేడుకల్ని నిర్వహించింది.



తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







