యూఏఈలో ప్రపంచ యోగా దినోత్సవం: వేలాదిమంది హాజరు
- June 21, 2017
దుబాయ్:ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం పెద్ద సంఖ్యలో యూఏఈ వ్యాప్తంగా యోగాసనాల్లో మునిగి తేలారు. మూడో ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. 2014లో జూన్ 21వ తేదీని ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న చర్యల నేపథ్యంలో యోగాకి ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిందనడం నిస్సందేహం. 5 వేల సంవత్సరాలకు పూర్వమే యోగా, భారత సంస్కృతీ సంప్రదాయాలు, జీవన శైలిలో భాగమైంది. యోగా అనేది ఓ ఆరోగ్యకరమైన జీవన విధానంగా ప్రపంచ దేశాలు గుర్తించాయి. యూఏఈ వ్యాప్తంగా ఈసారి చాలా ప్రాంతాల్లో యోగాసనాల కోసం ఏర్పాట్లు జరిగాయి. దుబాయ్లో బుర్జ్ పార్క్, జబీల్ పార్క్, బురమైమీ కాంప్లెక్స్ సహా పలు చోట్ల యోగాసన కార్యక్రమాలు జరిగాయి. ఇండియన్ కాన్సులేట్ జనరల్, స్థానిక స్కూల్స్ మరియు యోగా అసోసియేషన్స్తో కలిసి దుబాయ్లో యోగా దినోత్సవ వేడుకల్ని నిర్వహించింది.



తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









