పాక్లో ఉగ్రస్థావరాలపై దాడులు చేయాలని భావిస్తున్న అమెరికా
- June 21, 2017
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పాక్ పొరుగుదేశం అఫ్గానిస్తాన్లోనూ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులను అమెరికా తీవ్రతరం చేయనుంది. ట్రంప్ యంత్రాంగంలోని అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం... డ్రోన్ దాడులను విస్తృతం చేయడం, పాక్కు ఇస్తున్న నిధుల్లో కోత విధించడం లేదా వాటిని మళ్లించడం, నాటోయేతర మిత్రదేశంగా పాక్కు ఉన్న హోదాను తగ్గించడం తదితర చర్యలకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోంది.
అయితే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అమెరికా ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నా విఫలమవుతోందనీ, ఇప్పుడు కూడా ప్రయత్నం ఫలిస్తుందన్న నమ్మకం లేదని కొంతమంది అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో తమకు పాక్ నుంచి గట్టి సహాకారం కావాలి కానీ, ఆ దేశంతో సంబంధాలను తెంచుకోవడం కాదని యూఎస్ అధికారులు పేర్కొన్నారు. త్వరలో ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై ఇంకా స్పష్టంగా నిర్ణయించలేదన్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









