పాక్లో ఉగ్రస్థావరాలపై దాడులు చేయాలని భావిస్తున్న అమెరికా
- June 21, 2017
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పాక్ పొరుగుదేశం అఫ్గానిస్తాన్లోనూ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులను అమెరికా తీవ్రతరం చేయనుంది. ట్రంప్ యంత్రాంగంలోని అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం... డ్రోన్ దాడులను విస్తృతం చేయడం, పాక్కు ఇస్తున్న నిధుల్లో కోత విధించడం లేదా వాటిని మళ్లించడం, నాటోయేతర మిత్రదేశంగా పాక్కు ఉన్న హోదాను తగ్గించడం తదితర చర్యలకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోంది.
అయితే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అమెరికా ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నా విఫలమవుతోందనీ, ఇప్పుడు కూడా ప్రయత్నం ఫలిస్తుందన్న నమ్మకం లేదని కొంతమంది అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో తమకు పాక్ నుంచి గట్టి సహాకారం కావాలి కానీ, ఆ దేశంతో సంబంధాలను తెంచుకోవడం కాదని యూఎస్ అధికారులు పేర్కొన్నారు. త్వరలో ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై ఇంకా స్పష్టంగా నిర్ణయించలేదన్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







