800ఏళ్ల నాటి మసీదును పేల్చివేసిన ఐసిస్
- June 22, 2017
ఇరాక్లోని మొసూల్ నగరంలో గల అతి పురాతన చారిత్రక కట్టడం అల్ నూరీ మసీదును ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బుధవారం పేల్చివేశారు. మొసూల్ నగరాన్ని అధీనంలోకి తెచ్చుకునేందుకు గతకొన్ని నెలలుగా ఇస్లామిక్ ఉగ్రవాదులు, ఇరాక్ భద్రతా బలగాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐసిస్ ఉగ్రవాదులు మసీదును పేల్చివేసినట్లు ఇరాక్ బలగాలు చెబుతున్నాయి.
అయితే మసీదును తాము పేల్చలేదని ఇస్లామిక్ స్టేట్ పేర్కొంది. అమెరికా సంకీర్ణ దళాల వైమానిక దాడుల్లోనే అల్ నూరీ మసీదు ధ్వంసమైందని ఇస్లామిక్ స్టేట్కు చెందిన అమఖ్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. కాగా.. ఐసిస్ ఆరోపణలను అమెరికా తీవ్రంగా ఖండించింది. 'అల్ నూరీ మసీదు ధ్వంసమైంది. అయితే అది సంకీర్ణ దళాల వైమానిక దాడుల వల్ల మాత్రం కాదు. అసలు మేం ఆ ప్రాంతంలో బుధవారం దాడులు చేయలేదు' అని సంకీర్ణ దళాల అధికార ప్రతినిధి కల్నల్ ర్యాన్ దిల్లాన్ వెల్లడించారు.
ఏదేమైనా.. అతి పురాతన, ఎంతో ప్రాచుర్యం కలిగిన దేశ సంపదను ఇరాక్ కోల్పోయింది. 800 ఏళ్ల కిత్రం నూర్ అల్ దిన్ మహ్మద్ జంగీ ఆదేశాల మేరకు ఈ మసీదును నిర్మించారు. అప్పటి నుంచి ఈ మసీదు ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ మసీదులోని అతి ఎత్తైన స్తంభం లెర్నింగ్ మినరేట్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. అంతేగాక.. ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబు బకర్ అల్ బాగ్దాది.. మూడేళ్ల క్రితం ఈ మసీదులోనే తనకు తాను కలీఫాగా ప్రకటించుకున్నాడు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









