నాస్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో యోగ నిర్వహణ
- June 22, 2017
నాస్ కార్పోరేషన్ భారతీయ రాయబార కార్యాలయం సహకారంతో మినా సల్మాన్ హెడ్ క్వార్టర్స్లో వద్ద సోమవారం యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించారు..ఈ సందర్భంగా నాస్ కార్పరేషన్ చైర్మన్ సమీర్ ఎ. భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హాను ఈ కార్యక్రమానికి సాదరంగా స్వాగతించారు. నాస్ గ్రూప్ డైరెక్టర్ హేమంత్ జోషి యోగ కార్యక్రమమును ప్రారంభించటానికి వచ్చిన భారత రాయబారి మరియు ఇండియన్ ఎంబసీ సిబ్బంది కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "యోగా ఒక ప్రాచీన అభ్యాస ప్రక్రియ అని ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వ్యక్తులకు సంపూర్ణ శ్రేయస్సు సాధించడానికి సహాయం చేస్తున్న విధానమని అన్నారు. అలాగే ,యోగా ఆరోగ్యానికి అనుకూలమైన ప్రయోజనాలకు అదనంగా, మానసిక మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉందన్నారు.అనంతరం ప్రసంగించిన భారత రాయబారి ,యోగ యొక్క అపారమైన లాభాలను వివరించారు. యోగ ప్రయోజనాలను పలువురికి వివరించి యోగాను ప్రోత్సహించాలని ఆయన అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 120 కంటే ఎక్కువ మంది హాజరెయ్యారు. ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఈ కార్యక్రమం ఘన విజయం సాధించింది.
తాజా వార్తలు
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
- లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!







