రాజధాని శంకుస్థాపన వ్యాఖ్యాతగా నటుడు సాయికుమార్

- October 13, 2015 , by Maagulf
రాజధాని శంకుస్థాపన వ్యాఖ్యాతగా నటుడు సాయికుమార్

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లను సీఎం చంద్రబాబు, మంత్రులు స్వయనా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే రాజధాని శంకుస్థాపన ఆహ్వాన పత్రాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఇక అక్కడ జరిగే సభలో వ్యాఖ్యాతగా నటుడు సాయికుమార్ వ్యవహరించనున్నారు. ప్రధాని మోడీ సహా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో సాయికుమార్ అయితేనే చక్కగా వ్యాఖ్యానం చేయగలరని బాబు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇక శివమణి తన డ్రమ్స్‌తో సభా ప్రాంగణాన్ని హోరెత్తించనున్నారు. భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం, మంత్రులు నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com