హజ్యాత్ర పూర్తి చేసుకుని స్వరాష్ర్టానికి చేరుకుంటున్న యాత్రికులు
- October 14, 2015
హజ్యాత్ర పూర్తి చేసుకుని బుధవారం నుంచి స్వరాష్ర్టానికి చేరుకుంటున్న హజ్యాత్రికులకు అసౌకర్యం కలుగకుండా శంషాబాద్ ఎయిర్పోర్టు హజ్ టెర్మినల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. ఎయిర్ ఇండియాకు చెందిన రెండు ప్రత్యేక విమానాల్లో బుధవారం 680 మంది యాత్రికులు సౌదీ అరేబియాలోని మదీనా నుంచి హైదరాబాద్కు ఉదయం 8.40కి, రాత్రి 10.20కి చేరుకోనున్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అధికారులతో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్టులో హజ్ తొలి బృందానికి స్వాగతం పలకనున్నారు. ఈ నెల 20 వరకు మొత్తం 16 ప్రత్యేక విమానాల్లో రాష్ట్ర యాత్రికులు హైదరాబాద్ చేరుకుంటారు. హజ్టెర్మినల్లో వీరికి ఇబ్బందులు కలుగకుండా, లగేజిని త్వరగా చెకింగ్ చేసి అప్పగించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. తెలంగాణ హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ ఎస్ఏ షుకూర్, ఎయిర్ ఇండియా, కస్టమ్స్, ఇమిగ్రేషన్ అధికారులతో ఎయిర్పోర్టు హజ్ టెర్మినల్ను సందర్శించి ఏర్పాట్లు సమీక్షించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







