హజ్‌యాత్ర పూర్తి చేసుకుని స్వరాష్ర్టానికి చేరుకుంటున్న యాత్రికులు

- October 14, 2015 , by Maagulf
హజ్‌యాత్ర పూర్తి చేసుకుని స్వరాష్ర్టానికి చేరుకుంటున్న యాత్రికులు

హజ్‌యాత్ర పూర్తి చేసుకుని బుధవారం నుంచి స్వరాష్ర్టానికి చేరుకుంటున్న హజ్‌యాత్రికులకు అసౌకర్యం కలుగకుండా శంషాబాద్ ఎయిర్‌పోర్టు హజ్ టెర్మినల్‌లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. ఎయిర్ ఇండియాకు చెందిన రెండు ప్రత్యేక విమానాల్లో బుధవారం 680 మంది యాత్రికులు సౌదీ అరేబియాలోని మదీనా నుంచి హైదరాబాద్‌కు ఉదయం 8.40కి, రాత్రి 10.20కి చేరుకోనున్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అధికారులతో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హజ్ తొలి బృందానికి స్వాగతం పలకనున్నారు. ఈ నెల 20 వరకు మొత్తం 16 ప్రత్యేక విమానాల్లో రాష్ట్ర యాత్రికులు హైదరాబాద్ చేరుకుంటారు. హజ్‌టెర్మినల్‌లో వీరికి ఇబ్బందులు కలుగకుండా, లగేజిని త్వరగా చెకింగ్ చేసి అప్పగించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. తెలంగాణ హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ ఎస్‌ఏ షుకూర్, ఎయిర్ ఇండియా, కస్టమ్స్, ఇమిగ్రేషన్ అధికారులతో ఎయిర్‌పోర్టు హజ్ టెర్మినల్‌ను సందర్శించి ఏర్పాట్లు సమీక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com