చెన్నై సిల్క్ భవనం శిధిలాల కింద కిలోల కొద్దీ బంగారం, వెండి
- June 23, 2017
చెన్నై సిల్క్ భవనం గురించి కొత్త న్యూస్ వినిపిస్తుంది.. తాజాగా సిల్క్ భవన శిధిలాల్లో 400 కిలోల గోల్డ్, 2 వేల కిలోల వెండితో ఉన్న పెద్ద బాక్స్ లు బయటపడ్డాయి. బహిరంగా మార్కెట్లో వీటి విలువ రూ. 120 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇంతకీ శిధిలాల కింద ఈ బాక్సులు ఎలా వచ్చాయి ? అన్నదానిపై అనుమానాలు మొదలయ్యాయి. మే 31న చెన్నై టీ.నగర్ లోని సిల్క్ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభంవించింది. రెండు రోజులపాటు మంటలు అదుపులోకి రాలేదు. ఈ ఘటనలో కోట్లాది రూపాయులు విలువైన వస్త్రాలు, నగలు కాలిపోయాయని సంస్థ యాజమాన్యం ప్రకటించింది. దీంతో తమిళనాడు ప్రజాపన్నుల శాఖ, భవనాన్ని పూర్తిగా కూల్చివేసేందుకు 20 రోజులపాటు పనులను సాగించింది. శిధిలాలు తొలగించిన తర్వాత రెండు భారీ బాక్సులు కనిపించగా.. వాటిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వీటిల్లో 400 కిలోల బంగారం, 2 వేల కిలోల వెండి ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







