చెన్నై సిల్క్ భవనం శిధిలాల కింద కిలోల కొద్దీ బంగారం, వెండి
- June 23, 2017
చెన్నై సిల్క్ భవనం గురించి కొత్త న్యూస్ వినిపిస్తుంది.. తాజాగా సిల్క్ భవన శిధిలాల్లో 400 కిలోల గోల్డ్, 2 వేల కిలోల వెండితో ఉన్న పెద్ద బాక్స్ లు బయటపడ్డాయి. బహిరంగా మార్కెట్లో వీటి విలువ రూ. 120 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇంతకీ శిధిలాల కింద ఈ బాక్సులు ఎలా వచ్చాయి ? అన్నదానిపై అనుమానాలు మొదలయ్యాయి. మే 31న చెన్నై టీ.నగర్ లోని సిల్క్ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభంవించింది. రెండు రోజులపాటు మంటలు అదుపులోకి రాలేదు. ఈ ఘటనలో కోట్లాది రూపాయులు విలువైన వస్త్రాలు, నగలు కాలిపోయాయని సంస్థ యాజమాన్యం ప్రకటించింది. దీంతో తమిళనాడు ప్రజాపన్నుల శాఖ, భవనాన్ని పూర్తిగా కూల్చివేసేందుకు 20 రోజులపాటు పనులను సాగించింది. శిధిలాలు తొలగించిన తర్వాత రెండు భారీ బాక్సులు కనిపించగా.. వాటిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వీటిల్లో 400 కిలోల బంగారం, 2 వేల కిలోల వెండి ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









