పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉంటా రామ్నాథ్ కోవింద్
- June 23, 2017
రామ్నాథ్ కోవింద్
రాష్ట్రపతి పదవి పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉంటుందని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ అన్నారు. శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. 'నేను గవర్నరుగా ఉన్న సమయంలో కూడా.. ఏ పార్టీకి అనుకూలంగా లేను. రాష్ట్రపతి అభ్యర్థిగా నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అని అన్నారు. 'రాష్ట్రపతి పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడతాను. త్రివిధ దళాలపై సుప్రీం కమాండర్గా రాష్ట్రపతి ఉంటారు. మన దేశ సరిహద్దు భద్రతను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది'.. అని కోవింద్ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా సీనియర్ నేతల సమక్షంలో కోవింద్ పార్లమెంటు భవనానికి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కోవింద్కు ఇప్పటికే అన్నాడీఎంకే, జేడీయూ, తెదేపా, టీఆర్ఎస్, శివసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







