షార్జాలో మహిళ మృతిపై విచారణ ప్రారంభం
- June 23, 2017
షార్జా: షార్జా పోలీసులు, అల్ గఫ్యా ప్రాంతంలోని ఓ ఇంట్లో మృతి చెందిన 26 ఏళ్ళ మహిళకు సంబంధించిన కేసు విచారణ ప్రారంభించారు. షార్జా పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ, బుధవారం ఉదయం 5 గంటల సమయంలో ఫోన్ కాల్ వచ్చిందనీ, మహిళ మృతదేహాన్ని కనుగొన్నట్లుగా తెలియజేశారని చెప్పారు. మృతురాల్ని అచేతనావస్థలో కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే ఆమెను ఉదయం 5.35 నిమిషాల సమయంలో ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆమె మృతి చెందినట్లుగా ప్రకటించడం జరిగింది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ టీమ్, ఈ కేసు విచారణ చేపట్టింది. అటాప్సీ కోసం ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి మృతదేహాన్ని తరలించారు. ఆమెది హత్యా? లేదంటే ఆత్మహత్యకు పాల్పడిందా? అనే విషయం తేలాల్సి ఉంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







