ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్: షేక్ మొహమ్మద్ ఆదేశం
- June 23, 2017
దుబాయ్:ఇయర్ ఆఫ్ గివింగ్ నేపథ్యంలో యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ట్రాఫిక్ మరియు ఇంపౌండ్మెంట్ జరీమానాల్లో 50 శాతం డిస్కౌంట్ ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈద్ అల్ ఫితర్ ముందు రూలర్ ఈ ఆదేశాలు జారీ చేసినట్లుగా ట్విట్టర్ ద్వారా దుబాయ్ మీడియా ఆఫీస్ వెల్లడించింది. 2016 జులై 1 నుంచి 2016 డిసెంబర్ 31 వరకు నమోదైన జరీమానాలకు మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. 2017 జనవరి నుంచి నమోదైన జరీమానాలకు ఈ డిస్కౌంట్ వర్తించదు. వాహనదారులు తమ జరీమానాల్ని పోలీస్ స్టేషన్లు, దుబాయ్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, వెహికిల్ రిజిస్ట్రేషన్ సెంటర్స్, ఫైన్ పేమెంట్ మెసీన్స్ వంటి వాటి ద్వారా చెల్లించడానికి వీలుంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







