నేటి నుంచి మోడీ మూడు దేశాల పర్యటన
- June 23, 2017
దిల్లీ: అమెరికాతో భారత్ భాగస్వామ్యం బహుళ అంచెలతో, భిన్నత్వంతో కూడుకున్నదని ప్రధాని మోదీ అన్నారు. ఈ నెల 25,26 తేదీల్లో మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో 26న భేటీ అవుతారు. అమెరికా పర్యటన గురించి మోదీ శుక్రవారం ఫేస్బుక్లో వివరిస్తూ భవిష్యత్తు దార్శనికత నిర్మాణమే ఈ పర్యటన లక్ష్యమన్నారు. అమెరికాతో భారత్ సంబంధాలు కేవలం రెండు ప్రభుత్వాలకు మాత్రమే సంబంధించినవి కాదని, రెండు వైపులా భాగస్వాములందరికీ సంబంధించినవని చెప్పారు. గతంలో ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన సంగతిని ప్రధాని ఫేస్బుక్లో గుర్తు చేశారు. ట్రంప్, ఆయన మంత్రివర్గ సహచరులతో అధికారిక సమావేశాలతో పాటు అమెరికా సీఈవోలతో సమావేశమవుతున్నానని, ప్రవాస భారతీయులతోనూ సంభాషిస్తానని తెలిపారు. ట్రంప్ ఆహ్వానంపై తాను అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ప్రధాని ఈ నెల 24న పోర్చుగల్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ దేశ ప్రధాని కోస్తాతో భేటీ అవుతారు. 27న నెదర్లాండ్స్ వెళ్లి ప్రధాని మార్క్ రట్టెతో భేటీ అవుతారు.
* డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









