నేటి నుంచి మోడీ మూడు దేశాల పర్యటన
- June 23, 2017
దిల్లీ: అమెరికాతో భారత్ భాగస్వామ్యం బహుళ అంచెలతో, భిన్నత్వంతో కూడుకున్నదని ప్రధాని మోదీ అన్నారు. ఈ నెల 25,26 తేదీల్లో మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో 26న భేటీ అవుతారు. అమెరికా పర్యటన గురించి మోదీ శుక్రవారం ఫేస్బుక్లో వివరిస్తూ భవిష్యత్తు దార్శనికత నిర్మాణమే ఈ పర్యటన లక్ష్యమన్నారు. అమెరికాతో భారత్ సంబంధాలు కేవలం రెండు ప్రభుత్వాలకు మాత్రమే సంబంధించినవి కాదని, రెండు వైపులా భాగస్వాములందరికీ సంబంధించినవని చెప్పారు. గతంలో ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన సంగతిని ప్రధాని ఫేస్బుక్లో గుర్తు చేశారు. ట్రంప్, ఆయన మంత్రివర్గ సహచరులతో అధికారిక సమావేశాలతో పాటు అమెరికా సీఈవోలతో సమావేశమవుతున్నానని, ప్రవాస భారతీయులతోనూ సంభాషిస్తానని తెలిపారు. ట్రంప్ ఆహ్వానంపై తాను అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ప్రధాని ఈ నెల 24న పోర్చుగల్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ దేశ ప్రధాని కోస్తాతో భేటీ అవుతారు. 27న నెదర్లాండ్స్ వెళ్లి ప్రధాని మార్క్ రట్టెతో భేటీ అవుతారు.
* డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









